India vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య మరో ఆసక్తికర క్రికెట్ సమరానికి తెరలేవనుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి పోరు నేడు ఎడ్జ్బాస్టన్ వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, క్రికెట్ అభిమానులు ఈ హోరాహోరీ పోరును ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకు స్వల్ప ఆధిక్యం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భారీ స్కోరు నమోదు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడమే రెండు జట్ల వ్యూహంగా ఉండే అవకాశముంది. ఈ సిరీస్లో భారత జట్టుకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ వన్డే జట్టులోకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
గాయాల నుంచి కోలుకున్న జస్ప్రీత్ బుమ్రా కూడా చాలా రోజుల తర్వాత వన్డే ఫార్మాట్లో బరిలోకి దిగనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా వ్యవహరించగా, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది. టీ20 సిరీస్లో ఆశించిన ఫలితం రాకపోవడంతో వన్డేల్లో సత్తా చాటాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.
బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న భారత జట్టు విజయంతో సిరీస్ను ప్రారంభించాలని భావిస్తోంది. భారత్ జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా.








