Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANAKAPALLIనూకాంబిక తల్లి పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహింపు

నూకాంబిక తల్లి పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహింపు

-

Chat on WhatsApp

శ్రీ నూకాంబిక తల్లి పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమలతో అలంకరించిన అమ్మవారిని భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ బైలాపూడి శ్రీరామదాసు మాట్లాడుతూ, మా గ్రామ దేవత నూకాంబిక తల్లి భక్తుల కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి గాంచిందని, ప్రతి ఏడాది పండుగను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.

భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తాగునీరు, మజ్జిగ, అన్నదానం నిర్వహించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసారు. నూకాంబిక తల్లి కృపతో గ్రామ అభివృద్ధి, భక్తుల సంక్షేమం కొనసాగాలని ప్రార్థనలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.

ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, సుందరపు సతీష్, రోడ్ల అభివృద్ధి చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు హాజరయ్యారు. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టిడిపి, జనసేన పార్టీల ప్రముఖ నేతలు కూడా హాజరై పూజల్లో పాల్గొన్నారు.

అమ్మవారి ఉత్సవం సందర్భంగా ఆలయం సుదర్శనంగా అలంకరించబడింది. ప్రత్యేక హోమాలు, మంగళ వాయిద్యాలు, భజనలు నిర్వహించబడ్డాయి. గ్రామస్తులు పండుగను కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకున్నారు. భక్తుల విశ్వాసానికి తగిన విధంగా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

assam rifles convoy attacked by militants in manipur ukhrul district

Assam | మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి.. అమరులైన ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు

Assam: మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకోవడంతో భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉఖ్రుల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన కాన్వాయ్‌పై మిలిటెంట్లు జరిపిన ఆకస్మిక దాడిలో ఇద్దరు జవాన్లు విధి నిర్వహణలో...
- Advertisement -
Chat on WhatsApp