Gold Prices: కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. నిన్న తులం బంగారం ధర రూ.930 వరకు పెరగగా, నేడు కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తాజా ధరలను పరిశీలిస్తున్నారు. జూలై 28 నాటికి హైదరాబాద్, విజయవాడ, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,910గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,33,710గా నమోదైంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,46,050, 22 క్యారెట్లది రూ.1,33,860గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,45,870 కాగా, బెంగళూరులో రూ.1,45,590గా నమోదైంది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర మాత్రం రూ.2,39,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొనే పరిణామాలే బంగారం ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. అమెరికా డాలర్ బలపడటం లేదా బలహీనపడటం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల ధోరణి వంటి అంశాల ఆధారంగా పసిడి ధరలు మారుతుంటాయి.
మరోవైపు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, రవాణా వ్యయాలు, స్థానిక పన్నుల కారణంగా నగరాలవారిగా స్వల్ప ధరల తేడాలు కనిపిస్తాయి. ఆభరణాలు కొనుగోలు చేసే ముందు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనంగా వర్తిస్తాయని గుర్తుంచుకుని, సమీప జ్యువెలరీ షోరూమ్లో తాజా ధరలను నిర్ధారించుకోవడం మంచిది.
ALSO READ: Ahmedabad Crash Investigation | ఎయిరిండియా AI-171 ప్రమాదంపై కేంద్రం క్లారిటీ.. కేంద్రం కీలక ప్రకటన








