Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeBusinessStock Market Today | నష్టాల నుంచి లాభాల బాట.. మార్కెట్‌లో ఒక్కరోజే భారీ మార్పు

Stock Market Today | నష్టాల నుంచి లాభాల బాట.. మార్కెట్‌లో ఒక్కరోజే భారీ మార్పు

-

Chat on WhatsApp

Stock Market Today: ఐదు రోజుల నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకుని ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా మారడం, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లో కొనుగోళ్ల జోరు పెరిగింది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించగా, ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు భారీగా ఎగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 776.29 పాయింట్లు ఎగిసి 76,835.78 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 229.40 పాయింట్లు లాభపడి 23,995.95 వద్ద స్థిరపడింది. దీంతో నిఫ్టీ మరోసారి 24 వేల మార్కుకు చేరువైంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగివచ్చాయి. ఇది దిగుమతులపై ఆధారపడే భారత్‌కు అనుకూల సంకేతంగా మారడంతో ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగింది. ట్రేడింగ్‌లో ఎటర్నల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఇన్ఫోసిస్ షేర్లు అత్యధిక లాభాలు నమోదు చేశాయి.

ఐటీ, మీడియా, రియాల్టీ, ఫార్మా, మెటల్ రంగాల్లో కొనుగోళ్లు జోరందుకోగా, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా ప్రధాన సూచీల కంటే మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. అయితే ఆయిల్ అండ్ గ్యాస్ రంగం మాత్రం ఇతర రంగాలంతగా రాణించలేదు. రూపాయి బలపడటం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం మెరుగుపడటం, కంపెనీల త్రైమాసిక ఫలితాలపై ఆశావహ అంచనాలు కూడా మార్కెట్ ర్యాలీకి బలమైన మద్దతు ఇచ్చాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

KCR visiting Peddi Sudarshan Reddy at Yashoda Hospital

KCR | యశోద ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యేకు కేసీఆర్ భరోసా.. ఆరోగ్యంపై ఆరా

KCR: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పరామర్శించారు. గుండెపోటు రావడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స...
- Advertisement -
Chat on WhatsApp