Geetanjali: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ భార్య గీతాంజలి తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు జంతర్మంతర్ వద్ద మొదటి నుంచి ఆందోళన చేస్తున్న సమయంలో కాంగ్రెస్ ముందుకు రాలేదని, ఇప్పుడు నిరసనలు చేపట్టడం చిత్తశుద్ధిని ప్రశ్నించేలా ఉందన్నారు. ఈ ఉద్యమం పూర్తిగా విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకత కోసం ప్రారంభమైందని, దీనికి రాజకీయ రంగు పులమకూడదని స్పష్టం చేశారు.
సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు అడ్డుకుని ఆస్పత్రికి తరలించిన తర్వాత కూడా ఆయన అక్కడి నుంచే నిరసన కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ ఉద్యమాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించిన గీతాంజలి, అలాంటి ప్రయత్నాలను యువత గుర్తిస్తుందని అన్నారు. తమకు అధికార, ప్రతిపక్ష పార్టీలతో సంబంధం లేదని, ఈ అంశంపై పార్లమెంటే స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. నిజాయతీ, స్వచ్ఛత ఆధారంగా ఈ ఉద్యమం సాగుతోందని పేర్కొన్న ఆమె, ఎలాంటి రాజకీయ ఎజెండా లేని వారు మాత్రమే తమకు మద్దతుగా నిలవాలని చెప్పారు.
ALSO READ: NEET Students Dance | ఇది నిరసననా.. లేక రైన్ డాన్స్ ఆ.. నిరసన కాస్తా సెలబ్రేషన్గా మారింది !








