Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshభూమి దురాక్రమణకు వ్యతిరేకంగా రైతు ఆందోళన

భూమి దురాక్రమణకు వ్యతిరేకంగా రైతు ఆందోళన

-

Chat on WhatsApp

శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామానికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం, 60 సంవత్సరాలుగా తన భూమిని రక్షించుకుంటున్నా కొంతమంది దురాక్రమణకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన సందర్భంగా, ఆయన కుటుంబ సభ్యులు, ఈ భూమి 60 సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉందని చెప్పారు. వారి తండ్రులు, పినతండ్రులు ఈ భూమిని తమ పేరుపై రికార్డుల్లో ఉంచుకోవడానికి కృషి చేసినట్టు తెలిపారు.

తమకు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంపకం పతకం కింద పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చిన విషయాన్ని వారు ధృవీకరించారు. ఆయన తండ్రి, పినతండ్రి గతంలో పంపకాలు చేసుకున్నట్లు చెప్పారు. అయితే, సుమారు 15 సంవత్సరాల క్రితం వారు తమ భూమి యొక్క చిన్న అన్న భాగాన్ని విక్రయించుకున్నట్టు వివరించారు.

ప్రస్తుతం, ఈ భూమిని కొన్న వ్యక్తులు, తమ భూమి అయినదని, ఆన్లైన్ రికార్డుల్లో కూడా తమ పేరుపై ఉన్నట్టు దౌర్జన్యాన్ని చేసుకుంటూ, రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు చెప్పారు. వారు తమ ఆధీనంలో ఉన్న భూమిని దురాక్రమణ చేయాలని యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై, బాధితులు ఇప్పటికే మండల తాసిల్దారుకు వినతిపత్రం సమర్పించారని, ఈ అంశంపై అధికారులు విచారణ జరిపి, వారికి న్యాయం చేయాలని వారు కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp