Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshదళిత భూముల ఆక్రమణపై చర్యలు కోరుతున్న బాధితులు

దళిత భూముల ఆక్రమణపై చర్యలు కోరుతున్న బాధితులు

-

Chat on WhatsApp

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం కోత వేటు దూరంలోని పెద్ద బండపల్లి, ఎం ఆర్ నగర్ ప్రాంతాల్లో దళిత భూములు అక్రమంగా ఆక్రమించుకున్న చుక్క శ్రీదేవిపై కేసు నమోదు చేయాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తాత, తండ్రుల కాలంలో ఇచ్చిన భూములను లాక్కొంటూ అన్యాయానికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు 20 ఎకరాల మెట్టుపల్లాన్ని ఆక్రమించుకున్న చుక్క శ్రీదేవి, దళితులను తరిమి కొడుతూ భూములను బలవంతంగా తన ఆధీనంలోకి తీసుకుంటుందని ఆరోపిస్తున్నారు. పట్టలేనన్ని అక్రమాలు ఆమె చేస్తున్నారని, విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలని కోరుతున్నారు.

దళితుల ఇళ్లలోకి అక్రమంగా చొరబడి, వారిపై దాడులకు తెగబడుతున్న చుక్క శ్రీదేవి కొంతమంది దుండగులతో కలిసి గన్‌తో బెదిరించిందని బాధితులు చెబుతున్నారు. పోలీసులు, ప్రజా ప్రతినిధులు దీన్ని గమనించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, దళితుల భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని వారు కోరుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp