CM Yogi Adityanath: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు జూన్ 5 సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశం పంపారు.
ప్రధాని మోడీ తన సందేశంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సమగ్ర అభివృద్ధి సాధించడం వంటి అంశాలపై ఆయన నిరంతరం దృష్టి పెట్టారని పేర్కొన్నారు. యోగి దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోడీ శుభాకాంక్షలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మార్గదర్శకత్వం, విశ్వాసం తనకు ఎల్లప్పుడూ శక్తినిచ్చే ప్రేరణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. “వికసిత ఉత్తర్ప్రదేశ్” లక్ష్య సాధనలో ప్రధాని సహకారం ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే సందర్భంగా మథుర ఎంపీ, ప్రముఖ నటి హేమమాలిని కూడా సీఎం యోగికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సీఎం యోగితో చర్చించడం తనకు ఎప్పుడూ సంతోషాన్నిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆయన దార్శనికత, అభివృద్ధి దృష్టి ప్రశంసనీయమని ఆమె అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు సీఎం యోగి ఆదిత్యనాథ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ALSO READ: Ponnam Brabhakar | ‘చెట్లు నాటడం జీవన భాగం కావాలి’.. పర్యావరణ దినోత్సవంలో మంత్రి సందేశం








