CM Chandrababu Naidu: రాయలసీమను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో పలు హామీలు ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. వేదవతి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి హంద్రీ-నీవా ద్వారా నీటి సరఫరా కల్పిస్తామని చెప్పారు. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుతో ఆ ప్రాంతానికి ‘స్వర్ణగిరి’గా గుర్తింపు తీసుకొచ్చామని, 2028 మార్చి నాటికి రాయలసీమ స్టీల్స్ను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ, రూ. లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు కూడా ప్రభుత్వ లక్ష్యాల్లో భాగమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఈ ఏడాదిలో పూర్తి చేసి, 2027 మార్చిలో జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్, పెట్రోల్ సరఫరా తగ్గి రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడిందని సీఎం తెలిపారు. ఎల్నినో కారణంగా వర్షపాతం భారీగా తగ్గడంతో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు, పండ్లు, కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని సూచించిన ఆయన, రాజకీయ ప్రత్యర్థులపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ALSO READ: Telangana weather | తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్








