నిజాంపేటలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ
నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతుల్లో విద్యాబోధన చేశారు. ప్రధానోపాధ్యాయులుగా సింధు, డీఈవోగా నవదీప్ గౌడ్, ఎంఈఓగా సాత్విక్ బాధ్యతలు నిర్వహించారు. ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అరుణ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యాబోధన చేయడం సమాజంలో బాధ్యతను పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, స్వయం నియంత్రణ పెరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ…
