Kids Convocation held grandly at Ravindra Bharathi School, Palakonda; dignitaries praised the kids and encouraged creativity.

పాలకొండలో బాలల కాన్వోకేషన్ వేడుక వైభవంగా

పాలకొండ రవీంద్ర భారతీ పాఠశాలలో బుధవారం రాత్రి చిన్నారుల కోసం నిర్వహించిన కిడ్స్ కాన్వోకేషన్ వేడుక ఎంతో ఘనంగా సాగింది. విద్యార్థులు అందంగా అలంకరించిన వేదికపై పాల్గొన్న ఈ వేడుక, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు పిల్లల ప్రతిభను ప్రశంసిస్తూ కీలక విషయాలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతి గారు మాట్లాడుతూ, “నేటి చిన్నారులే రేపటి సమాజాన్ని తీర్చిదిద్దే పౌరులు. వారి భవిష్యత్తు బాగుండాలంటే…

Read More
Elephant rampage in Jiyyammavalasa. Attack on tamarind-laden truck, shattered windows. Driver, cleaner fled in fear as travelers panic.

జియ్యమ్మవలసలో గజరాజుల బీభత్సం, లారీ ధ్వంసం

జియ్యమ్మవలస మండలం సుభద్రమ్మవలస సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చింతపండుతో వెళ్తున్న ఓ లారీని అడ్డుకుని దాన్ని ధ్వంసం చేశాయి. లారీ అద్దాలను పగులగొట్టి, లోపల ఉన్న వస్తువులను చెల్లాచెదురు చేశాయి. గత కొన్ని రోజులుగా ఈ మార్గంలో ఏనుగుల కదలికలు ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏనుగుల గుంపు లారీవైపు విరుచుకుపడటంతో డ్రైవర్, క్లీనర్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వెంటనే లారీ నుంచి దూకి పరుగులు పెట్టారు. అదృష్టవశాత్తూ వారు ప్రాణాలతో…

Read More
Tribal associations demand a full inquiry into fund utilization under Velugu APD Satyam Naidu's tenure.

పార్వతీపురం ఐటిడిఏ పీవోకి గిరిజన సంఘాల వినతిపత్రం

పార్వతీపురం ఐటిడిఏ పీవోకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన నాయకులు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధుల ఖర్చుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని వెలుగు ఏపీడీ సత్యం నాయుడు హయాంలో జరిగిన ఖర్చులను పరిశీలించాలని వారు కోరారు. వివిధ మండలాలకు సరఫరా చేసిన యంత్రాలు, సామగ్రి, ఇతర కొనుగోళ్లలో ఏమైనా అక్రమాలు జరిగాయా అనే విషయంపై ప్రభుత్వం సత్వర విచారణ చేపట్టాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. చింతపండు మరియు ఇతర…

Read More
Farmers in Parvathipuram express anger over continued elephant attacks, alleging inaction by forest officials.

పార్వతీపురం జిల్లాలో ఏనుగుల విరుచుకు పోటనపై రైతుల ఆవేదన

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రాజ్యలక్ష్మిపురం, కళ్లికోట, దుగ్గి, గంగిరేగువలస, గుణానపురం, పరసురామపురం, శివుని, విక్రమ్ పురం ప్రాంతాల్లో ఏనుగులు తిరుగుతున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల భయంతో పొలాల్లోకి వెళ్లలేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 2017లో ఒడిశా నుండి వచ్చిన ఏనుగుల వల్ల ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా, 6 కోట్ల రూపాయల మేర పంట నష్టం వాటిల్లింది. అయినప్పటికీ ఏనుగుల సమస్యను…

Read More
Mokkavalasa tribal farmers struggle to locate their land pattas, urge the government for resolution.

మక్కువ గిరిజన రైతుల ఆవేదన – పట్టా భూముల సమస్యపై ఆందోళన

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం గిరిజన గ్రామాల రైతులు తమ భూముల గుర్తింపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోకవలస గ్రామానికి చెందిన గిరిజన రైతులు, తమకు భూములకు పట్టాలు ఇచ్చినా, భూమి ఎక్కడ ఉందో తెలియడం లేదని వాపోయారు. ఆన్లైన్‌లో కూడా రికార్డులు నమోదు కాలేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గిరిజన గ్రామాల భూసమస్యలు తీవ్రంగా పెరిగాయని, గిరిజన రైతులకు ఇచ్చిన భూములు కేవలం కాగితాల్లోనే మిగిలిపోయాయని ఆరోపిస్తున్నారు. పట్టా ఉందన్న నమ్మకం…

Read More
NTR Health Service staff urge the government for cadre implementation, minimum pay scale, and job security.

ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బందికి కేడర్, జీత భద్రత కల్పించాలి

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫీల్డ్ సిబ్బంది తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ, తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 17 ఏళ్లుగా ఈ పథకంలో పనిచేస్తున్న తమకు కనీస స్కేలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మార్పులు వచ్చినప్పటికీ తమ సమస్యలకు పరిష్కారం లభించలేదని ఫీల్డ్ సిబ్బంది అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వారికి కేడర్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగులకు ప్రభుత్వం తగిన…

Read More
Tribals and small farmers oppose converting 1100 acres in Seethanagaram into an elephant zone.

సీతానగరంలో ఏనుగుల జోన్ వ్యతిరేకంగా గిరిజనుల ఆందోళన

సీతానగరం మండలంలోని అప్పయ్యపేట, రేపటి వలస, తామర కండి, గుచ్చుమి గ్రామాల గిరిజనులు, సన్నచిన్న రైతులు కొండ పోరంబోకు స్థలాల్లో జీవిస్తున్నారు. ఇక్కడి భూముల్లో డి పట్టాలతో బ్రతుకుతున్న వారు ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫారెస్ట్ అధికారులు 1100 ఎకరాల కొండ ప్రాంతాన్ని ఏనుగుల జోన్‌గా ప్రకటించడం అన్యాయమని, ఇది గిరిజన గ్రామాలకు, చిన్న రైతులకు పెనుముప్పుగా మారుతుందని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవనాధారం కోల్పోయే స్థితికి గ్రామస్తులు చేరుకున్నారని, వెంటనే ఈ…

Read More