Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshపార్వతీపురం వద్ద ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం

పార్వతీపురం వద్ద ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం

-

Chat on WhatsApp

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి జయపుర వైపు వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఆందోళన చెలరేగింది.

ఉదయం 7.45 గంటల సమయంలో ఆంధ్రా–ఒడిశా ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు.

ఇంజిన్‌ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్‌ వెంటనే వాహనాన్ని ఆపి ప్రయాణికులను దిగిపోవాలని సూచించారు. కొద్ది సేపట్లో మంటలు చెలరేగినా, అందరూ సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది.



సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై రాష్ట్ర మంత్రి సంధ్యారాణి స్పందించారు.

ఆమె అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే అగ్నిమాపక వాహనాన్ని అక్కడికి పంపించి, ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp