Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeCrime Newsకేర‌ళ ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు

కేర‌ళ ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు

-

Chat on WhatsApp

కేర‌ళ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంతో పాటు స‌చివాల‌యానికి నేడు బాంబు బెదిరింపులు అందిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ బెదిరింపుల నేప‌థ్యంలో అధికారులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. కొచ్చి ఎయిర్‌పోర్టుకు కూడా ఇదే మాదిరి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ బెదిరింపులపై బాంబ్ స్క్వాడ్, పోలీస్ బృందాలు వివిధ ప్రదేశాలకు చేరుకుని గాలింపు చేపట్టాయి. గత రెండు వారాలుగా కేర‌ళలోని ప్రభుత్వ కార్యాల‌యాల‌కు వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ రావడం అధికారులు తెలిపిన విష‌యమై, మొత్తం 12 బెదిరింపు కాల్స్ నోటిఫై అయ్యాయి.

కేర‌ళ హైకోర్టు, జిల్లా కలెక్టరేట్‌లు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు వంటి ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ బెదిరింపుల నేప‌థ్యంలో అధికారులు అప్రమత్త‌మై, త‌నిఖీలు చేప‌ట్టారు.

కాగా, నిన్న తిరువ‌నంతపురం విమానాశ్ర‌యంతో పాటు నగరంలోని పలు ప్రముఖ హోటళ్లకు కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అయితే, ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో, వీటిని నకిలీ బెదిరింపులు అని గుర్తించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana chief minister revanth reddy predicts 2029 assembly elections

CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్‌వే.....

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన...
- Advertisement -
Chat on WhatsApp