కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు సంబంధించిన వివాదంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన కుమారుడిపై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో తన పేరును రాజకీయంగా, మీడియా మరియు సోషల్ మీడియాలో ఉపయోగించకుండా ఆపాలని కోరుతూ బండి సంజయ్ కోర్టును ఆశ్రయించారు.
అలాగే ఇప్పటికే తన పేరుతో ప్రచారం జరిగిన వీడియోలు, డిజిటల్ కంటెంట్, పత్రికా కథనాలు మరియు పోస్టర్లను తొలగించాలని పిటిషన్లో కోరారు.
ఈ పిటిషన్ను విచారించిన కోర్టు, బండి సంజయ్ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించింది. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తక్షణమే ఆపాలని ఆదేశించింది. ఇప్పటివరకు ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగులు, పత్రికా కథనాలు, డిజిటల్ కంటెంట్ మరియు వాల్ పోస్టర్లను ఈ నెల 26లోపు తొలగించాలని స్పష్టం చేసింది.
ఆదేశాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. ఇకపై కూడా బండి సంజయ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఎలాంటి దుష్ప్రచారం చేయరాదని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.








