Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeTelanganaYadadri Temple | టీటీడీ తరహాలో యాదాద్రి అభివృద్ధి.. 18 మంది సభ్యులతో కొత్త పాలక...

Yadadri Temple | టీటీడీ తరహాలో యాదాద్రి అభివృద్ధి.. 18 మంది సభ్యులతో కొత్త పాలక మండలి, చిరంజీవి సతీమణి సురేఖకు చోటు

-

Chat on WhatsApp

Yadadri Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు భక్తులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో 18 మంది సభ్యులతో కూడిన కొత్త పాలక మండలిని నియమించింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రి ఆలయ అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ బోర్డు ప్రధాన బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోంది.

ఈ కొత్త పాలక మండలికి ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంఎస్‌ఎన్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డిని చైర్మన్‌గా నియమించారు. ఔషధ రంగంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన ఆయన విద్యా, పారిశ్రామిక రంగాల్లో విశేష అనుభవం కలిగి ఉన్నారు. ఉస్మానియా, పాలమూరు విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్‌లు పొందిన ఆయన మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి సోదరుడు కూడా.

పాలక మండలిలో పలువురు ప్రముఖులకు చోటు కల్పించారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా నియమితులయ్యారు. ఈ నియామకాలతో యాదాద్రి బోర్డుపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్ చైర్మన్, ఆలయ ఈవో, స్థానాచార్యులు తదితరులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఫౌండర్ ట్రస్టీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగిలిన సభ్యుల పదవీకాలం రెండేళ్లుగా నిర్ణయించారు. ఈ నిర్ణయానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా ప్రకటించింది. 

కొత్త పాలక మండలి ఏర్పాటుతో యాదాద్రి ఆలయంలో అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకుంటాయని, భక్తులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు ఈ బోర్డు కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Vijay Mehta | భారతీయ నాటక రంగానికి తీరని లోటు.. విజయ్ మెహతా ఇకలేరు,...

భారతీయ నాటక, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి, దర్శకురాలు విజయ్ మెహతా(Vijay Mehta) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి ముంబైలోని స్వగృహంలో...
- Advertisement -
Chat on WhatsApp