AP Lecturer Posts Recruitment:ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు”. విద్యార్థి మరియు యువజన సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా త్వరలో పూర్తిగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లోకేశ్ తెలిపారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యా వాతావరణాన్ని కాపాడాలని, అందుకే పోలిటికల్ స్పీచెస్కు క్యాంపస్లో అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు.
ALSO READ:Tejas fighter jet crashes | దుబాయ్లో కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్
అయితే, విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకునేందుకు విద్యాసంస్థల పనివేళలు పూర్తైన తర్వాత ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన మరింత వివరించారు.









