ఏపీలో త్వరలో 4,300 లెక్చరర్ పోస్టుల భర్తీ – మంత్రి నారా లోకేశ్ స్పష్టం

AP Minister Nara Lokesh announces recruitment of 4,300 lecturer posts Minister Nara Lokesh confirms upcoming recruitment for 4,300 lecturer posts in AP universities

AP Lecturer Posts Recruitment:ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు”. విద్యార్థి మరియు యువజన సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు.

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా త్వరలో పూర్తిగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లోకేశ్ తెలిపారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యా వాతావరణాన్ని కాపాడాలని, అందుకే పోలిటికల్ స్పీచెస్‌కు క్యాంపస్‌లో అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు.

ALSO READ:Tejas fighter jet crashes | దుబాయ్‌లో కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్


అయితే, విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకునేందుకు విద్యాసంస్థల పనివేళలు పూర్తైన తర్వాత ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన మరింత వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *