Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshCM Chandrababu | ఏపీ ప్రజలకు బంపరాఫర్...మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు...?

CM Chandrababu | ఏపీ ప్రజలకు బంపరాఫర్…మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు…?

-

Chat on WhatsApp

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న జనాభా రేటుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా తగ్గడం భవిష్యత్తులో ఆర్థిక మరియు సామాజిక సమస్యలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. యువ జనాభా తగ్గి వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల ఉత్పాదకత తగ్గిపోతుందని, ఇది రాష్ట్ర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు.

ఇప్పటి పరిస్థితుల్లో జనాభా నియంత్రణ కాకుండా జనాభా పెంపు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కుటుంబాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కొత్త ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. మూడో బిడ్డకు రూ.30,000, నాలుగో బిడ్డకు రూ.40,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం వెల్లడించారు.

పిల్లలు కుటుంబానికి భారం కాదని, వారు రాష్ట్ర భవిష్యత్తుకు అసలైన సంపద అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనాభా పెరుగుదల ద్వారా మానవ వనరులు బలపడతాయని ఆయన తెలిపారు.

అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం ద్వారా పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ నిర్మాణం లక్ష్యమని చెప్పారు. ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం ప్రభుత్వానికి సంతృప్తినిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, పార్టీ శ్రేణుల సమన్వయంతోనే పాలన విజయవంతమవుతుందని సీఎం స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp