Monday, July 13, 2026
Chat on WhatsApp
HomeTelanganaషాబాద్ సామూహిక హత్యల కేసు నిందితుడి రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం

షాబాద్ సామూహిక హత్యల కేసు నిందితుడి రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం

-

Chat on WhatsApp

Shabad Mass Murder Case: షాబాద్ మండలం దైవాలగూడలో చోటుచేసుకున్న సామూహిక హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించిన రాజ్‌కుమార్ మృతదేహం రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని పెంజర్ల ప్రాంతంలో లభ్యమైంది. ఈ పరిణామం కేసు దర్యాప్తులో కొత్త మలుపుగా మారింది. ఆరుగురి హత్యల అనంతరం రాజ్‌కుమార్ పరారీలోకి వెళ్లడంతో అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు.

తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక బృందాలు ముమ్మరంగా వెతుకులాట నిర్వహించాయి. ఇంతలోనే అతని మృతదేహం లభించడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, పోలీసులు పట్టుకుంటారనే భావించి రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనాస్థలంలో విషపదార్థం బాటిల్ లభించగా, రాజ్‌కుమార్ మృతదేహం అతని మేనమామ ఊరి శివారులో కనిపించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

akhil akkineni thanks chiranjeevi for praising lenin movie success

Chiranjeevi | లెనిన్’ సక్సెస్‌పై చిరంజీవి ప్రశంసలు.. అఖిల్ ఎమోషనల్ రిప్లై

Chiranjeevi: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’ చిత్రం ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే మంచి స్పందనను సొంతం చేసుకోవడంతో సినీ ప్రముఖులు చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. ఈ...
- Advertisement -
Chat on WhatsApp