Thursday, August 6, 2026
Chat on WhatsApp
HomeNationalఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నాయకుడు మరణం

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నాయకుడు మరణం

-

Chat on WhatsApp

ఛత్తీస్‌గఢ్ లోని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత జయరాం అలియాస్ చలపతి మరణించినట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసుల కాల్పుల్లో చలపతి సహా 14 మంది మావోయిస్టులు చనిపోయారు. చలపతిపై గతంలోనే ప్రభుత్వం రూ. కోటి రివార్డు ప్రకటించింది.

విశ్వసనీయ సమాచారంతో ఒడిశా బార్డర్ దగ్గర గరియాబండ్ జిల్లా కులరైఘాట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో భద్రతాబలగాలు సోమవారం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతాబలగాలను చూశాక కాల్పులు జరపడం ప్రారంభించాయి.

ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మరణించారు. వారి మృతదేహాలను చెట్లు, పొదల పక్కన కనుగొనడం జరిగింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సెల్ఫ్ లోడింగ్ రైఫిళ్లు లభ్యమయ్యాయి.

భద్రతా బలగాలు ఇక్కడ మావోయిస్టుల కదలికలు, అక్రమ కార్యకలాపాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp