Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshస్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ లో మద్దులూరి మాలకొండయ్య

స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ లో మద్దులూరి మాలకొండయ్య

-

Chat on WhatsApp

చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రతి నెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ఉద్యమం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రతి నెలా ప్రత్యేకమైన థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తామని చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య తెలిపారు.

స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌లో భాగంగా, చీరాల పురపాల సంఘం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మానవహారం నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించి, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రషీద్ గారు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

AEE ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? APTRANSCO కీలక ప్రకటన

APTRANSCO: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీపై వస్తున్న ప్రచారాలకు ఏపీట్రాన్స్‌కో పూర్తి స్థాయిలో చెక్ పెట్టింది. నియామక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేదని, పూర్తిగా అభ్యర్థుల...
- Advertisement -
Chat on WhatsApp