Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaAdilabadభారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని శ్యామలాదేవి అభినందనలు

భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని శ్యామలాదేవి అభినందనలు

-

Chat on WhatsApp

భారత రాజ్యాంగం 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా, అదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1949, నవంబర్ 26న ఆమోదించబడిన భారత రాజ్యాంగం ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడింది.

ఈ సందర్భంగా, శ్యామలాదేవి తన ఛాంబర్‌లో భారత రాజ్యాంగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె భారత ప్రజల హక్కులను, సమానతలను, స్వేచ్ఛను అందిస్తూ, 1949, నవంబర్ 26 న ఆమోదించబడిన రాజ్యాంగాన్ని అనుసరించేందుకు, రాజ్యాంగ విలువలపై ప్రతిజ్ఞ చేశారు.

“భారతదేశాన్ని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా నిర్మించుకోవడానికి, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడం, స్వాతంత్ర్యాలను కల్పించడం, సమానత్వాన్ని చేకూర్చడం” అని ఆమె పేర్కొంది. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ AO రామిరెడ్డి, రెవెన్యు విభాగం సిబ్బంది, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Shubman Gill injured during practice session before India's Sri Lanka Test series.

Sri Lanka Test 2026 | శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.....

Sri Lanka Test 2026: శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతున్న టీమిండియాకు అనుకోని షాక్ తగిలింది. టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటంతో, శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల...
- Advertisement -
Chat on WhatsApp