Thursday, July 2, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshబాపట్లలో రోడ్డు ప్రమాదం – బైక్‌ లారీని ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి

బాపట్లలో రోడ్డు ప్రమాదం – బైక్‌ లారీని ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి

-

Chat on WhatsApp

బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గడియార స్తంభం కూడలిలో వేగంగా దూసుకొచ్చిన బైక్‌ లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడ గ్రామానికి చెందిన షేక్ రిజ్వాన్‌ (21), చింతల నాని (21) బీహార్ సూర్యలంక బీచ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


బీచ్‌ మూసివేయడంతో గుంటూరుకు బయలుదేరిన వారు చీరాల నుంచి వస్తున్న లారీ వెనుకకు బైక్‌తో ఢీకొట్టారు. ఢీకొట్టిన వేగం కారణంగా ఇద్దరూ ఒక్కసారిగా ఎగిరిపడి తీవ్ర గాయాల కారణంగా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:హాంకాంగ్ సిక్సెస్ 2025:కెప్టెన్‌గా దినేష్ కార్తిక్

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp