Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeTamil Naduతమిళనాడులో దారుణం: పోలీసులే యువతిపై సామూహిక అత్యాచారం

తమిళనాడులో దారుణం: పోలీసులే యువతిపై సామూహిక అత్యాచారం

-

Chat on WhatsApp

ప్రజల రక్షణ కోసం ఉన్న రక్షక భటులే భయంకరమైన ద్రవ్యపాత్రలుగా మారిన ఘోర సంఘటన తమిళనాడులోని పుణ్యక్షేత్రం అరుణాచల ప్రాంతంలో చోటుచేసుకుంది. దర్శనార్థం వెళ్లిన ఏపీకి చెందిన ఇద్దరు యువతులు, తిరిగి మృగాళ్లైన కానిస్టేబుళ్ల చేతిలో అఘాయిత్యానికి గురయ్యారు. పోలీసులు చేసిన ఈ దారుణ చర్య తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆగ్రహం రేకెత్తిస్తోంది.

రక్షకులే భక్షకులుగా మారిన హృదయ విదారక ఘటన:

సోమవారం అర్ధరాత్రి సమయంలో తిరువణ్ణామలై బైపాస్‌ వద్ద కానిస్టేబుళ్లు సుందర్‌, సురేశ్‌రాజ్‌ వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో, లోడు వాహనంలో ప్రయాణిస్తున్న 20, 18 ఏళ్ల అక్కాచెల్లెళ్లను ఆపి కింద దించారు. తెలుగు మాట్లాడుతున్న కారణంగా, వారు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారని గుర్తించి, వారిని ప్రయాణిస్తున్న వాహనాన్ని పంపేసి, తమ ద్విచక్రవాహనాలపై ఎక్కించారు.

తర్వాత, 6 కిలోమీటర్ల దూరంలోని ఏందల్ గ్రామ శ్మశానవాటికకు వారిని తీసుకెళ్లి, అక్కను బెదిరించి పక్కన కూర్చోబెట్టి, చెల్లిపై అత్యంత దారుణమైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన అనంతరం, అక్కడే వదిలేసి పరారయ్యారు.

బాధితుల అరుపులు, స్థానికుల స్పందన:

మంగళవారం ఉదయం, శ్మశానంలో బయంతో రోదిస్తున్న అక్కాచెల్లెళ్లను చూసిన స్థానికులు, తక్షణమే స్పందించి వారిని తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అక్క పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

నిందితుల అరెస్టు, అధికారుల స్పందన:

ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందిత కానిస్టేబుళ్లైన సుందర్‌, సురేశ్‌రాజ్‌లను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ స్వయంగా స్పందించి, న్యాయం జరగడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అయితే ప్రజలలో న్యాయంపై నమ్మకం నిలుపుకునేందుకు, ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటన కలిగించిన తీవ్ర ప్రభావం:

ఈ ఘటన ప్రజల్లో భయాందోళనలు కలిగించడమే కాదు, పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని గట్టిగా సవాల్ చేసింది. ఇప్పటికే పోలీసుల తీరుపై పలుచోట్ల విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఇలా కానిస్టేబుళ్లే అఘాయిత్యానికి పాల్పడడం మరింత తీరని నష్టంను మిగుల్చింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Veteran Telugu actress Pavala Shyamala passed away

Pavala Shyamala | టాలీవుడ్‌లో విషాదం.. నవ్వులు పంచిన నటి  పావలా శ్యామల ఇకలేరు

తెలుగు సినీ పరిశ్రమ మరో సీనియర్ నటిని కోల్పోయింది. ఎన్నో చిత్రాల్లో తన సహజ నటన, హాస్యభరిత పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల(Pavala Shyamala...
- Advertisement -
Chat on WhatsApp