Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఒంటిపూట బడులపై కీలక అప్ డేట్..

ఒంటిపూట బడులపై కీలక అప్ డేట్..

-

Chat on WhatsApp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. దీని ప్రకారం, ప్రతిరోజూ ఉదయం 7.45 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పాఠశాలలు కొనసాగుతాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఒంటిపూట బడులు ఉన్నప్పటికీ, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తరగతులు ముగిసిన వెంటనే విద్యార్థులకు పౌష్టికాహారం అందించి ఇంటికి పంపేలా ఏర్పాట్లు చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

24K and 22K gold prices increase in India with today's latest silver rates across major cities.

Gold Price Today | బంగారం కొనాలనుకుంటున్నారా?.. నేటి ధరలు చూసి షాక్ అవుతారు!

Gold Price Today: బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మరోసారి షాక్ తగిలింది. కొద్ది రోజుల పాటు స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టడంతో మార్కెట్‌లో కొనుగోలుదారుల...
- Advertisement -
Chat on WhatsApp