Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఎమ్మిగనూరులో అక్రమ మద్యం పట్టివేత

ఎమ్మిగనూరులో అక్రమ మద్యం పట్టివేత

-

Chat on WhatsApp

కర్ణాటక రాష్ట్రానికి చెందిన అక్రమంగా మద్యంను తరలిస్తున్న ద్విచక్ర వాహనమును స్వాధీనపరచుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎమ్మిగనూరు సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. పట్టణంలో స్థానిక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రాలయం మండలంలోనీ మాధవరం చెక్ పోస్ట్ దగ్గర, సోగునూరు జడ్పీ హైస్కూల్ రోడ్డు దగ్గర బైక్ పై అక్రమ మాద్యం తరలిస్తుండగా వారి వద్ద అక్రమ మద్యం (90 ఎంఎల్) ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని, ఒక బైక్ సీజ్ చేసి, ఇద్దరూ వ్యక్తులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. మద్యం, బైక్ విలువ దాదాపు 80,000 వేల రూపాయలు ఉంటుందని సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. ప్రజలు అక్రమ మద్యం గురించి ఫిర్యాదు చెయ్యదలిచినచో 9440902579 కు ఫోన్ చేసి సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

microsoft announces 4800 employee layoffs during global restructuring

Microsoftలో మరో భారీ లేఆఫ్స్.. 4,800 ఉద్యోగుల తొలగింపు ?

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థగా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్(Microsoft) మరోసారి ఉద్యోగుల సంఖ్యను తగ్గించే నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభించిన నేపథ్యంలో సంస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,800 మంది ఉద్యోగులను...
- Advertisement -
Chat on WhatsApp