Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaఉగాదికి తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ

ఉగాదికి తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ

-

Chat on WhatsApp

తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఉగాది పండుగ నాడు అంటే మార్చి 30న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఏప్రిల్ 1 నుంచి ప్రజలకు బియ్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ పథకంతో రాష్ట్రంలోని లక్షలాది మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు.

ప్రభుత్వం నవంబర్ వరకు సన్న బియ్యం పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 16 లక్షల టన్నుల బియ్యాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. బియ్యం నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. అన్ని రేషన్ దుకాణాల్లో ఈ పథకం సజావుగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

సన్న బియ్యం పథకం అమలుతో రైతులకు సైతం లాభం కలుగుతోంది. ప్రభుత్వ బోనస్ అందించడంతో సన్న వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతులు పెద్ద ఎత్తున సన్న ధాన్యం సాగు చేయడంతో, మార్కెట్‌లో బియ్యం సరఫరా పెరిగింది.

ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందించడం ప్రభుత్వ లక్ష్యం. రేషన్ కార్డుదారులకు సరఫరా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు నూతన విధానాలను రూపొందించారు. అందుబాటులో ఉన్న నిధులతో నవంబర్ వరకు పంపిణీ కొనసాగిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp