అమెరికా–చైనా మధ్య సుంకాల యుద్ధం ఉద్ధృతంగా మారింది

The tariff war between the USA and China escalates as the USA increases tariffs to 245%. China bans Boeing purchases. Major impact on international trade.

అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య ఉన్న వాణిజ్య యుద్ధం మరింత ఉధృతమైంది. తాజాగా అమెరికా ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై సుంకాన్ని 145 శాతం నుంచి 245 శాతానికి పెంచింది. ఈ నిర్ణయానికి కారణం చైనా తీసుకున్న ప్రతీకార చర్యలేనని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య మళ్లీ వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఈ చర్యకు ప్రాతిపదికగా.. రెండు రోజుల క్రితం చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉంది. అమెరికా విమాన తయారీ సంస్థ అయిన బోయింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని తమ దేశ విమానయాన సంస్థలకు ఆదేశించింది. అంతేకాకుండా బోయింగ్ నుండి విడిభాగాలను కూడా కొనవద్దని స్పష్టంగా తెలిపింది. ఇది వాణిజ్య పరంగా బోయింగ్ సంస్థకు భారీ నష్టం కలిగించే చర్యగా అర్థం చేసుకోవచ్చు.

చైనా ఈ విధంగా కఠిన నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే అమెరికా ప్రతీకారంగా స్పందించింది. చైనా దిగుమతి వస్తువులపై భారీగా సుంకాలను పెంచుతూ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ సుంకాల పెంపుతో అమెరికాలో చైనా వస్తువుల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. దీంతో అమెరికన్లు ఆ వస్తువుల కొనుగోలు చేయడం తగ్గించనున్న పరిస్థితి ఉంది.

ఈ వాణిజ్య యుద్ధంతో రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత కల్లోలంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ఇప్పటికే అమెరికా దిగుమతులపై 125 శాతం వరకు సుంకాలను విధిస్తున్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఈ విధమైన చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *