Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకురుపాం మండలంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం

కురుపాం మండలంలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం

-

Chat on WhatsApp

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని గుజ్జువాయి గ్రామంలో యన్.డి.ఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయినా సందర్భంగా “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు.

కురుపాం ఎమ్మెల్యే తోయక జగదిశ్వరి ముఖ్య అతిధిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ ఇచ్చారు.

ముందుగా ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో పాల్గొని, పత్తి పంటకు సంబంధించి రైతులకు సూచనలు మరియు సలహాలు ఇచ్చారు.

అనంతరం, గుజ్జువాయి రిజర్వాయర్ ను సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడారు, వారి సమస్యలు తెలుసుకున్నారు.

గుజ్జువాయి సమీపంలో ఉన్న రిజర్వాయర్ ద్వారా సాగునీరు వృధాగా పోవడంతో, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేకు రైతులు తెలియజేశారు.

వెంటనే రిజర్వాయర్ మరమ్మతు పనులు చేపట్టే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా, ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించడంతో పాటు కరపత్రాలను అందజేశారు.

రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు అమలు చేయడం కూటమి ప్రభుత్వం ద్వారా సాధ్యమని ఎమ్మెల్యే జగదీశ్వరి పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Air India AI-171 crash investigation officials examining aircraft wreckage

Ahmedabad Crash Investigation | ఎయిరిండియా AI-171 ప్రమాదంపై కేంద్రం క్లారిటీ.. కేంద్రం కీలక...

Ahmedabad Crash Investigation: ఎయిరిండియా AI-171 విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి సాంకేతిక అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, తుది...
- Advertisement -
Chat on WhatsApp