Telangana mountaineer: తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్(Mountaineer Bhukya Yashwant ) మరోసారి చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే దేశంలోని పలు ప్రముఖ పర్వతాలను అధిరోహించిన యశ్వంత్ తాజాగా ఒడిశాలోని మౌంట్ దియోమలి(Mount Diomali Odisha) (1,672 మీటర్లు) ఎక్కాడు.
భూక్య యశ్వంత్ దేశంలో అత్యంత ఎత్తైన 28 పర్వతాలను, అలాగే ఏడు ముఖ్య శిఖరాలను అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు.
ఇందులో భాగంగా నార్త్ఈస్ట్లోని అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అసోం రాష్ట్రాల్లో పర్వతాలను అధిరోహించడంతో పాటు, రాజస్థాన్, ఒడిశా పర్వతాలను కూడా ఎక్కిన ఈ గిరిజన యువకుడు దేశవ్యాప్తంగా సహస క్రీడలకు ప్రాచుర్యం చేకూర్చుతున్నాడు.
ప్రతి శిఖరాన్ని అధిరోహించిన తర్వాత తనలో మరింత ఆత్మవిశ్వాసం, శారీరక ఫిట్నెస్ మరియు మానసిక ప్రణాళిక పెరుగుతున్నదని భూక్య యశ్వంత్ తెలిపారు.
ALSO READ:Telangana railway budget | తెలంగాణకు రైల్వే కేంద్ర బడ్జెట్లో తక్కువ శాతం
