Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయ (Chilkur Balaji Temple ) వ్యవస్థాపకుడు సౌందర్ రాజన్(Soundararajan) (90) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిలుకూరులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
వీసా బాలాజీగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయ అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడంలో సౌందర్రాజన్ పాత్ర కీలకంగా నిలిచింది.









