Saudi Arabia: అంతర్జాతీయ ఆరోగ్య ముప్పుల నేపథ్యంలో సౌదీ అరేబియా(Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా సుమారు 40 దేశాల నుంచి కోళ్లు, కోడిగుడ్లు మరియు సంబంధిత పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతిపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు Saudi Food and Drug Authority ప్రకటించింది. ప్రజారోగ్య పరిరక్షణ, ఆహార భద్రత బలోపేతమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం పలు దేశాల్లో బర్డ్ ఫ్లూ వంటి వైరస్లు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, పౌల్ట్రీ ఉత్పత్తుల ద్వారా అంటువ్యాధులు దేశంలోకి వచ్చే ప్రమాదం ఉందని సౌదీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
వ్యాధులు వ్యాపించిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందస్తుగా అడ్డుకోవడం ఉత్తమమనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
నిషేధిత జాబితాలో ఉన్న దేశాలు
India – భారత్
China – చైనా
United Kingdom – యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్)
Germany – జర్మనీ
Japan – జపాన్
Indonesia – ఇండోనేషియా
Bangladesh – బంగ్లాదేశ్
Nepal – నేపాల్
Afghanistan – అఫ్ఘానిస్తాన్…
వంటి దేశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం అంతర్జాతీయ పౌల్ట్రీ మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు చేసే భారత వ్యాపారులు నష్టపోయే పరిస్థితి నెలకొనవచ్చు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఆంక్షలను పునఃసమీక్షించే అవకాశముందని సమాచారం.
READ MORE:Kaza Toll Plaza | కాజా టోల్ ప్లాజాలో సర్వర్ సమస్యలు…వాహనదారుల ఆగ్రహం








