ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు “సలార్ పార్ట్ 2” పై దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel) కీలక అప్డేట్ ఇచ్చినట్లు సమాచారం. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈ సినిమా భవిష్యత్తుపై పలు ఊహాగానాలు వినిపిస్తుండగా, తాజా క్లారిటీతో అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది.
సలార్ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ భారీ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ కథనం, గ్రాండ్ విజువల్స్తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఖాన్సార్ రాజ్యాన్ని నేపథ్యంగా తీసుకుని దేవా, వరదరాజ మన్నార్ పాత్రల మధ్య సాగిన కథ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మొదటి భాగం విడుదల సమయంలోనే చిత్రబృందం రెండో భాగం రానుందని ప్రకటించింది. అయితే ఇటీవల ప్రశాంత్ నీల్ మరో భారీ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టారనే వార్తలు రావడంతో “సలార్ 2” ఆగిపోయిందా అనే సందేహాలు అభిమానుల్లో పెరిగాయి.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ స్పందిస్తూ ప్రస్తుతం Jr.NTRతో తెరకెక్కిస్తున్న “డ్రాగన్” సినిమా పూర్తి అయిన వెంటనే “సలార్ 2” పనులు ప్రారంభిస్తానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా నిలిచిపోలేదని, కేవలం షెడ్యూల్ కారణంగా ఆలస్యం జరుగుతోందని అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న “ఫౌజీ”, Spirit, అలాగే Kalki 2898 AD సీక్వెల్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే సమయానికి ప్రశాంత్ నీల్ కూడా తన ప్రస్తుత సినిమా పూర్తి చేసే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2027 చివరి నాటికి “సలార్ 2” సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి భాగంతో పోలిస్తే మరింత భారీ యాక్షన్ సన్నివేశాలు, బలమైన ఎమోషనల్ డ్రామాతో రెండో భాగాన్ని అత్యంత గ్రాండ్ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Salaar 2 | ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్… డ్రాగన్ తర్వాత సలార్ 2, ప్రశాంత్ నీల్ క్లారిటీ
-








