Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeCrime Newsబెట్టింగ్ యాప్‌లపై సజ్జనార్ కఠిన హెచ్చరిక!

బెట్టింగ్ యాప్‌లపై సజ్జనార్ కఠిన హెచ్చరిక!

-

Chat on WhatsApp

బెట్టింగ్ యాప్‌లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. క్షణికావేశంతో డబ్బు సంపాదించాలనే ఆశతో ఎంతో మంది బెట్టింగ్ బారినపడిపోతున్నారని, చివరకు అప్పుల పాలై ఆత్మహత్యల బాట పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బు కోసం బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని సజ్జనార్ మండిపడ్డారు. అమాయక ప్రజలు దీనికి బలవకుండా ఉండాలని కోరారు. ఇప్పటికే వైజాగ్ సీపీ ఒక యూట్యూబర్‌పై కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదని, ఈ యాప్‌లను ప్రమోట్ చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ఫాలోయింగ్ కోల్పోవడంతో పాటు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వివరించారు.

అప్పులు చేసి బెట్టింగ్‌లలో పాల్గొన్నవారు ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారని, చివరకు ప్రాణాలు తీసుకునే స్థితికి చేరుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేయొద్దని, ఇన్ఫ్లుయెన్సర్ల మాటలను నమ్మొద్దని స్పష్టం చేశారు. ప్రజలు తమ దగ్గర డబ్బు కోల్పోయినా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్ నిషేధితమైనా, ఆన్‌లైన్‌లో కొనసాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలను మోసం చేసే యాప్‌లను ప్రమోట్ చేయొద్దని సెలబ్రిటీలకు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. డబ్బు సంపాదనకు తప్పుదారి తొక్కకూడదని హితవు పలికారు. “సే నో టు బెట్టింగ్ యాప్స్” ఉద్యమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. యువత కష్టపడి పనిచేసి జీవితాన్ని నిర్మించుకోవాలని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indian Government | చిన్నారుల భద్రతపై కేంద్రం సీరియస్.. ఇన్‌స్టాగ్రామ్‌కు నోటీసులు జారీ

Indian Government: సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక నోటీసులు జారీ చేసింది. చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ...
- Advertisement -
Chat on WhatsApp