Friday, July 3, 2026
Chat on WhatsApp
HomeBusinessStock Market Today | లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

Stock Market Today | లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

-

Chat on WhatsApp

Stock Market Today: చివరి ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ మార్కెట్లు పెట్టుబడిదారులకు లాభాలను అందించాయి. గ్లోబల్ మార్కెట్లలో స్పష్టత లేకపోయినా, ఐటీ, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు పెరగడంతో దేశీయ సూచీలు బలపడ్డాయి.  ముఖ్యంగా ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, రియాల్టీ రంగాలకు చెందిన షేర్లలో నమోదైన కొనుగోళ్లు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాలను నమోదు చేశాయి.

ఉదయం ప్రారంభం నుంచే సానుకూల ధోరణి కనబరిచిన మార్కెట్‌లో సెన్సెక్స్ ఒక దశలో 600 పాయింట్లకు పైగా ఎగిసింది. అనంతరం కొంత లాభాల స్వీకరణ కనిపించినప్పటికీ, ముగింపు సమయానికి 261.79 పాయింట్లు పెరిగి 77,763.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 95.15 పాయింట్లు బలపడి 24,270.85 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.

సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు అత్యధిక లాభాలు నమోదు చేశాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

గ్లోబల్ కమోడిటీ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 71 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 4,179 డాలర్ల సమీపంలో కొనసాగింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 95.22 వద్ద నమోదైంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వచ్చే వారం అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

indian parliament monsoon session 2026 key bills and political agenda

Parliament Monsoon Session | జూలై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. రాజకీయ వేడి...

దేశ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలకు వేదికగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Session) మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జూలై 20 నుంచి సమావేశాలను నిర్వహించే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు...
- Advertisement -
Chat on WhatsApp