Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeOthersఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, ఎండల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, ఎండల హెచ్చరిక

-

Chat on WhatsApp

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్న ప్రకటనలో, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో సోమవారం (నేడు) పిడుగుతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మంగళవారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగుతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవి వాతావరణ మార్పులతో కూడుకున్న వర్షాలు కావడంతో, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదిలా ఉండగా, ఆదివారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా రావికమతం, వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో 41.4 డిగ్రీలు, విజయనగరం జిల్లా గుర్లలో 41.2 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా మురమండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటి ప్రభావం వాతావరణంలో మార్పు కలిగించి, వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. సోమవారం ఉదయం మెదక్ లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ లో 35 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, భద్రాచలం, రామగుండం, నిజామాబాద్, హనుమకొండ జిల్లాల్లో 36 నుండి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp