Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeNationalGlasgow 2026 | గ్లాస్గోలో త్రివర్ణ పతాకం ఎగరాలి.. భారత జట్టుకు మోడీ శుభాకాంక్షలు

Glasgow 2026 | గ్లాస్గోలో త్రివర్ణ పతాకం ఎగరాలి.. భారత జట్టుకు మోడీ శుభాకాంక్షలు

-

Chat on WhatsApp

Commonwealth Games 2026: ప్రపంచ క్రీడా వేదికపై మరో ప్రతిష్టాత్మక పోటీకి రంగం సిద్ధమైంది. కామన్వెల్త్ గేమ్స్‌ గ్లాస్గో 2026(Glasgow 2026) వేదికగా ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత బృందం విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో  దేశం తరఫున బరిలోకి దిగుతున్న ప్రతి క్రీడాకారుడు పూర్తి ఉత్సాహం, పట్టుదల, క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొంటారని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. భారత ఆటగాళ్లు చూపిస్తున్న ప్రతిభ, అంకితభావం కోట్లాది మంది భారతీయులకు నిరంతరం స్ఫూర్తిని అందిస్తోందని అన్నారు. క్రీడాకారుల కృషి, క్రమశిక్షణ, విజయాల పట్ల దేశం గర్వపడుతోందని మోడీ తెలిపారు.  

ఇటీవలి సంవత్సరాల్లో భారత క్రీడా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, వివిధ క్రీడా విభాగాల్లో మన ఆటగాళ్లు ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధిస్తున్నారని ప్రధాని అభినందించారు. గ్లాస్గో వేదికగా జరగనున్న ఈ క్రీడల్లో భారత క్రీడాకారులు కొత్త విజయాలను అందుకుని దేశ ప్రతిష్టను మరింత పెంచాలని కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Abhijit Dipke | రాజీనామా చేయాల్సిందే.. ధర్మేంద్ర ప్రధాన్‌పై సీజేపీ ఒత్తిడి

Abhijit Dipke: ఢిల్లీలో సీజేపీ నిరసన కార్యక్రమాలు కొనసాగుతుండగా, రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేసే...
- Advertisement -
Chat on WhatsApp