Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshPM Modi Puttaparthi Visit: సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు నరేంద్ర మోడీ

PM Modi Puttaparthi Visit: సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు నరేంద్ర మోడీ

-

Chat on WhatsApp

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు నేడు ప్రధాని నరేంద్ర మోడీ(Pm narendramodi) రానున్నారు . శతాబ్ది(Sathya Sai Baba Centenary) ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ప్రత్యేకంగా పుట్టపర్తికి చేరుకుంటున్నారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రధాని శ్రీ సత్య సాయి బాబా(Sathya Sai Baba) మహా సమాధిని సందర్శించి నివాళి అర్పించనున్నారు. అనంతరం 10.30 గంటలకు జరుగనున్న సత్యసాయి శత జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సత్య సాయి బాబా జీవితం, సేవా కార్యక్రమాలు, వారసత్వానికి గుర్తింపుగా ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ స్టాంపు మరియు స్మారక నాణెన్ని ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు.

తరువాత సత్యసాయి సేవలు, ఆధ్యాత్మిక విశిష్టత, సంస్థ కార్యకలాపాల పట్ల తన అభిప్రాయాలను తెలియజేస్తూ భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పుట్టపర్తి ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయగా, వేలాది మంది భక్తులు PM సందర్శన కోసం ఎదురుచూస్తున్నారు.

ALSO READ:Urban Naxals Issue: అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దు:బండి సంజయ్

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Telangana CM Revanth Reddy submitting the SIR form

CM Revanth Reddy | ప్రతి ఓటరికి సీఎం రేవంత్ సూచన.. SIRను నిర్లక్ష్యం చేయొద్దు

CM Revanth Reddy: తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా SIR ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ అధికారి (BLO)కి సమర్పించారు....
- Advertisement -
Chat on WhatsApp