Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeNationalకరణం మల్లీశ్వరితో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ

కరణం మల్లీశ్వరితో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ

-

Chat on WhatsApp

ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశ గౌరవాన్ని పెంచిన ప్రముఖ వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరిని ప్రధాని నరేంద్ర మోదీ కలిసి మన్ననలు తెలిపారు. హరియాణాలోని యమునానగర్‌లో ఈ భేటీ సోమవారం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

భారతదేశానికి అంతర్జాతీయ వేదికపై ఘనతను అందించిన మల్లీశ్వరి విజయాలను మోదీ కొనియాడారు. ఆమె పట్టుదల, అంకితభావం, ప్రతిభ దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఒక క్రీడాకారిణిగా ఆమె విజయాలు దేశ గర్వకారణమని తెలిపారు.

ప్రస్తుతం మల్లీశ్వరి క్రీడల్లో యువతను తీర్చిదిద్దడంలో భాగంగా చేస్తున్న కృషిని ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. యువ అథ్లెట్లను ప్రోత్సహిస్తూ, వారికి మార్గదర్శకత్వం వహిస్తున్న విధానాన్ని ఆయన అభినందించారు. ఆమె సేవలు దేశానికి అమూల్యమైనవని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దేశంలోని క్రీడాభిమానులు, తెలుగు ప్రజలు ఈ సమావేశాన్ని గర్వంగా చూసుకుంటున్నారు. మల్లీశ్వరి వంటి క్రీడా మణులను గుర్తించి ప్రధాని వారికి ప్రోత్సాహం ఇవ్వడం సంతోషకరమని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

pv sindhu playing badminton match at japan open super 750 tournament

PV Sindhu | పీవీ సింధు దూకుడు.. 35 నిమిషాల్లో మ్యాచ్ ముగించి క్వార్టర్...

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు(PV Sindhu) జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో అదిరిపోయే ఆటతీరుతో ముందుకు సాగుతోంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ యూయే...
- Advertisement -
Chat on WhatsApp