Gold and Silver: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) దేశంలోకి బంగారం, వెండి దిగుమతులపై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. వీటిని RBI ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నదని తెలిపారు. ప్రధాన కారణం కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో పసిడి కొనుగోలు చేయడం, దాంతో బంగారం ధరలు పెరుగుతున్నట్లు చెప్పారు.
కరెంట్ ఖాతా లోటు నిర్వహించదగిన స్థాయిలోనే ఉన్నందున దిగుమతులపై ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తో కలిసి సంయుక్త విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
నిర్మలా సీతారామన్ బ్యాంకులు తమ కోర్ బిజినెస్పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, కస్టమర్కు అనవసరంగా లేదా తప్పుగా బీమా ఉత్పత్తులు విక్రయించడం చేయరాదు. భారత్ వృద్ధి పథంలో కొనసాగుతోందని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెంచాలని ఆకాంక్షించారు.
వివిధ దేశాలపై డోనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేయడం, ఆ తర్వాత భారత్ సహా అన్ని దేశాలకు 15 శాతం సుంకాలు విధించబడిన విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ మార్పులు భారత్పై ప్రభావం చూపవని, వాణిజ్య మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
అలాగే, హరియాణాలోని IDFC First Bank లో రూ.590 కోట్ల మోసంపై RBI కూడా స్పందించింది. వ్యవస్థీకృత మోసం గుర్తించబడలేదని గవర్నర్ చెప్పారు. ఈ ఘటన ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం లేకుండా పర్యవేక్షణలో ఉందని వెల్లడించారు.
ALSO READ:నాని ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్…అభిమానులకు పండగే పండగ








