మెగా స్టార్ ఫ్యాన్స్కు ఎప్పటికీ గుర్తుండిపోయే అరుదైన దృశ్యం హైదరాబాద్లో జరిగిన ‘మెగా 158’( Mega 158 launch) సినిమా పూజా కార్యక్రమంలో కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు ముగ్గురూ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
చిరంజీవి–దర్శకుడు బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ కొత్త చిత్రం ప్రారంభోత్సవం కేవలం సినిమా లాంచ్ కార్యక్రమంగా మాత్రమే కాకుండా మెగా అభిమానులకు ఒక ప్రత్యేక పండుగలా మారింది.
‘వాల్తేరు వీరయ్య’ విజయానంతరం అదే కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #Mega158 పూజా కార్యక్రమాలు గురువారం ఉదయం హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు నాగబాబు కూడా పాల్గొన్నారు.
చాలా రోజుల తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ముగ్గురూ ఒకే ఫ్రేమ్లో చిరునవ్వులతో కనిపించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్గా మారాయి.
మెగా బ్రదర్స్ కలిసి కనిపించిన ఈ ప్రత్యేక క్షణాలు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకంగా నిలిచాయి.








