భారత EV (ఎలక్ట్రిక్ వాహనాల) రంగంలో తన ఆధిపత్యాన్ని పెంచుకునే లక్ష్యంతో Kia India సరికొత్త Kia Syros EVను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కియా కంపెనీ నుంచి వచ్చిన రెండో సామాన్య వినియోగదారుల ఎలక్ట్రిక్ కారుగా Kia Syros EV నిలిచింది. కియా సైరోస్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం కాగా, రూ.25,000 ముందస్తు మొత్తంతో రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. కియా అధికారిక వెబ్సైట్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్షిప్లలో ఈ ఎలక్ట్రిక్ SUVను బుక్ చేసుకోవచ్చు.
Kia Syros EV రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 51.4kWh బ్యాటరీతో ఒకసారి పూర్తి ఛార్జ్పై 562 కి.మీ రేంజ్, 42kWh బ్యాటరీతో 443 కి.మీ రేంజ్ అందిస్తుంది. 100kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 39 నిమిషాల్లో బ్యాటరీని 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. బ్యాటరీ కండిషనింగ్ టెక్నాలజీ, K-Charge ఎకోసిస్టమ్, ఇంటిగ్రేటెడ్ రూట్ ప్లానర్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ SUVలో NMC బ్యాటరీ గరిష్టంగా 171 PS పవర్ను అందిస్తుంది. 51.4kWh వేరియంట్ కేవలం 8.1 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది. IP67 సర్టిఫైడ్ లిక్విడ్-కూల్డ్ బ్యాటరీతో మెరుగైన పనితీరు లభిస్తుంది.
క్యాబిన్లో 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్ప్లే, 12.3 అంగుళాల డిజిటల్ క్లస్టర్, టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, Kia Connect 2.0, వైర్లెస్ Android Auto, Apple CarPlay, Harman Kardon ఆడియో సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం Level-2 ADASతో 16 డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లను అందించారు. ఎక్కువ రేంజ్, ఆధునిక టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లతో Kia Syros EV భారత EV మార్కెట్లో కొత్త పోటీని తీసుకురానుంది.
ALSO READ: AP Weather Update | బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం








