Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshAP Governor | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

AP Governor | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

-

Chat on WhatsApp

AP Governor: హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను గవర్నర్ పరామర్శించి, ఆరోగ్యంపై ఆరా తీశారు. శస్త్రచికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్న తీరుపై వైద్యుల సూచనలు తెలుసుకుని, వాటిని కచ్చితంగా పాటించాలని సూచించారు.

వైద్యుల సూచనలు పాటిస్తూ త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్‌కు కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. అనంతరం ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో కొన్ని వారాల తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభం కానుందని, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కొంత సమయం అవసరమని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Matt Damon as Odysseus in Christopher Nolan's epic film The Odyssey

The Odyssey | ‘ది ఒడిస్సీ’ చూడాలంటే 30 నిమిషాల ముందే థియేటర్‌కు వెళ్లండి.....

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రిస్టోఫర్ నోలన్ తాజా చిత్రం 'ది ఒడిస్సీ'(The Odyssey) జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.  ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, ముఖ్యంగా ఐమ్యాక్స్‌లో...
- Advertisement -
Chat on WhatsApp