Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeInterNationalGoogle | వ్యాధుల నియంత్రణకు గూగుల్ డీబగ్ ప్రాజెక్ట్.. దోమల విడుదలకు ప్లాన్

Google | వ్యాధుల నియంత్రణకు గూగుల్ డీబగ్ ప్రాజెక్ట్.. దోమల విడుదలకు ప్లాన్

-

Chat on WhatsApp

Google: గూగుల్ సంస్థ దోమల వల్ల వ్యాప్తి చెందే రోగాలను అరికట్టేందుకు ఒక కొత్త తరహా ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 6.4 కోట్ల ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన దోమలను అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రయోగానికి సంబంధించి గూగుల్ సంస్థ అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA) అనుమతి కోసం ఎదురుచూస్తోంది. అనుమతి లభిస్తే వచ్చే రెండేళ్లలో దశలవారీగా ఈ దోమలను వాతావరణంలోకి విడుదల చేయనున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా వోల్బాచియా అనే సహజ బ్యాక్టీరియాతో మార్పు చేసిన మగ దోమలను ఉపయోగించనున్నారు. ఈ మగ దోమలు అడవిలో ఆడ దోమలతో కలిసినప్పుడు వచ్చే గుడ్లు ఫలదీకరణ చెందవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ద్వారా వ్యాధికారక దోమల జనాభా తగ్గే అవకాశం ఉంది. గూగుల్ ఈ కార్యక్రమాన్ని “డీబగ్” (Debug) ప్రాజెక్ట్ కింద 2014 నుంచే అభివృద్ధి చేస్తోంది.

రసాయనాలు లేదా క్రిమిసంహారకాలు ఉపయోగించకుండా సహజ బయోలాజికల్ విధానంలో దోమలను నియంత్రించడమే దీని ప్రధాన లక్ష్యం. కేవలం ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడుతాయి. ఈ ప్రాజెక్టులో విడుదల చేసే మగ దోమలు కాటు వేయవు కాబట్టి మానవులకు నేరుగా ప్రమాదం ఉండదని గూగుల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మలేరియా, డెంగ్యూ, జికా, చికున్‌గునియా, ఎల్లో ఫీవర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దోమల వల్లే వ్యాపిస్తాయి.

ఈ నేపథ్యంలో ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలోనే అతిపెద్ద దోమల నియంత్రణ ప్రాజెక్టుగా నిలవనుంది. అయితే లక్షల సంఖ్యలో ల్యాబ్ దోమలను విడుదల చేయడంపై కొంతమంది నిపుణులు పర్యావరణ ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన EPA పరిశీలనలో ఉండగా, ప్రజల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indus Waters Treaty arbitration dispute between India and Pakistan

Indus Waters Treaty | భారత్ ఇచ్చిన షాక్‌కు పాక్ విలవిల, సింధు వివాదం.. భారత్...

Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ వివాదంలో పాకిస్థాన్‌కు ఆర్థిక భారం పెరుగుతోంది. భారత్ ఈ ప్రక్రియకు దూరంగా ఉండటంతో, విచారణ నిర్వహణకు సంబంధించిన మొత్తం ఖర్చును ప్రస్తుతం...
- Advertisement -
Chat on WhatsApp