Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాం.... లోకేశ్..

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాం…. లోకేశ్..

-

Chat on WhatsApp

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బకాయిలను చెల్లించిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేశామని ఆయన వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

మాజీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపివేశారని లోకేశ్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులను ధ్వంసం చేయడమే కాకుండా, అనేక సంక్షేమ పథకాల అమలును అర్థాంతరంగా నిలిపివేశారని విమర్శించారు. అభివృద్ధి పనులను కొనసాగించడం ప్రభుత్వాల బాధ్యతనైనా వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మారినంత మాత్రాన పథకాలను రద్దు చేయడం సరైనది కాదని లోకేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వం శాశ్వతమైతే, ఎన్నికలు మాత్రం తాత్కాలికమేనని జగన్ గ్రహించాలని హితవు పలికారు. వైసీపీ పాలన విధ్వంసానికి ప్రతీకగా మారిందని, తాము ఆగిపోయిన అభివృద్ధిని మళ్లీ పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, మౌలిక వసతులు, విద్య, వైద్యం రంగాల్లో వెనకబడి ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధుల కొరతతో సంబంధం లేకుండా ముందుకు సాగుతామని లోకేశ్ ప్రకటించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indian Government | చిన్నారుల భద్రతపై కేంద్రం సీరియస్.. ఇన్‌స్టాగ్రామ్‌కు నోటీసులు జారీ

Indian Government: సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక నోటీసులు జారీ చేసింది. చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ...
- Advertisement -
Chat on WhatsApp