February 18, 2026
A1tv Telugu News
CPI demands 2 cents in urban areas, 3 cents in rural areas for housing. Protest held at Vizianagaram Tahsildar office.
APVIZAYANAGARAMvizianagaram town

పేదలకు ఇళ్ల స్థలాల కోసం సీపీఐ నిరసన

కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా పేదలకు ఇళ్ల స్థలాల మంజూరులో ఎలాంటి పురోగతి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య విమర్శించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించాలనే డిమాండ్‌తో విజయనగరం తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ నేతలు సోమవారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా మార్క్స్ నగర్ నుంచి పట్టణ వీధుల్లో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మొదటి విడతగా కొందరు లబ్దిదారుల దరఖాస్తులు ఇచ్చామని, మిగిలినవి రెండో విడతలో సమర్పిస్తామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి అలమండ ఆనందరావు, ఎస్. రంగరాజు, ఎన. నాగభూషణం, బల్జి వీధి శాఖ కార్యదర్శి పొందూరు అప్పలరాజు, ఏఐటీయూసీ నాయకులు పొడుగు రామకృష్ణ, అల్తి మరయ్య తదితరులు పాల్గొన్నారు.

పేదల ఇళ్ల కలను నిజం చేసేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇళ్ల స్థలాలపై స్పష్టమైన విధానం ప్రకటించాల్సిందేనని సీపీఐ నేతలు హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉగ్ర నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు వెల్లడించారు.

Related posts

మత్స్యకారులకు సీఎం జగన్ చేసిన సహాయాన్ని గుర్తుచేసిన వాసుపల్లి గణేష్‌

admin

తన ప్రాణాలు పోయినా 50 మందిని కాపాడాడు – కోనసీమ డ్రైవర్‌ ధైర్య సాహసం

Bajaswamy

పాఠశాలలో జన్మదిన వేడుకలపై లోకేశ్ అసంతృప్తి

admin

Leave a Comment