Vijay-Virat Kohli: క్రికెట్ మరియు రాజకీయాల కలయికతో కూడిన ఓ ఆసక్తికర దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు సి. జోసెఫ్ విజయ్ చేతిలో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ కనిపించిన ఫోటో నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఈ ఫోటోలో సీఎం విజయ్ సూట్ ధరించి, భుజంపై సంప్రదాయ వేష్టి వేసుకుని కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ను పట్టుకుని కనిపించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు, విజయ్ అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు.
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ MRF ఛైర్పర్సన్ కె.ఎమ్. మామెన్ ఈ బ్యాట్ను విజయ్కు బహుమతిగా అందించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో సుమారు రూ.5,300 కోట్ల పెట్టుబడితో కొత్త గ్రీన్ఫీల్డ్ టైర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుపై ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో ఈ గిఫ్ట్ అందజేశారు.
విజయ్కు క్రికెట్పై ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆయన ఎప్పటి నుంచో మద్దతుదారుగా ఉన్నారు. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్ సమయంలో సీఎస్కే బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించారు.
సీఎస్కే ఐకానిక్ ఎల్లో జెర్సీలో విజయ్ పలుమార్లు కనిపించగా, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కూడా ఆయనకు మంచి స్నేహసంబంధాలు ఉన్నాయని అభిమానులు చెబుతున్నారు. అలాంటి క్రికెట్ ప్రేమికుడైన విజయ్కు విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ బహుమతిగా రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారగా, “క్రికెట్ meets politics” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.








