Monday, February 23, 2026
No menu items!
spot_img
HomeAndhra Pradeshకోడూరు-ముప్పవరం కారిడార్ పనులు వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలి – సీఎం చంద్రబాబు

కోడూరు-ముప్పవరం కారిడార్ పనులు వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలి – సీఎం చంద్రబాబు

 AP CM Chandrababu: ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని జాతీయ రహదారి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. “బెంగళూరు-కడప-విజయవాడ కోడూరు-ముప్పవరం ఎకనమిక్ కారిడార్”(Bengaluru-Kadapa-Vijayawada corridor) పనులు వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలని, దాంతో అమరావతికి మెరుగైన రహదారి కనెక్టివిటీ కల్పించాలనీ ఆదేశించారు.

ప్రస్తుతం అమలులో ఉన్నవి, డీపీఆర్ దశలో ఉన్నవి కలిపి “రూ.1.40 లక్షల కోట్ల” ప్రాజెక్టులు 2029 నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

రాష్ట్రంలోని రెండు లైన్ ఎన్‌హెచ్లను వాహన రద్దీ ఆధారంగా “4-6 లైన్‌లు(4-6 lane expansion) విస్తరించాలి”, ముఖ్యంగా పోర్టులకు పటిష్టమైన కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. “మూలపేట, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం” పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు.

పీపీపీ విధానంలో 12 రహదారుల విస్తరణ, రూ.2,500 కోట్లతో 6,054 కిలోమీటర్ల రహదారుల రెన్యువల్ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. “డేనిష్ ఫైబర్, వేస్ట్ ప్లాస్టిక్ బిటుమిన్, నానో కాంక్రీట్” వంటి ఆధునిక సాంకేతికతలు వినియోగించాలని సూచించారు.

ALSO READ:ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఫోన్ కావాలా? రియల్‌మీ పీ4 పవర్ ఇదే సమాధానం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular