పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కస్తూర్బా పాఠశాల విద్యార్థులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో అస్వస్థతకు గురై, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో చర్చించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు.








