Allu Arjun: సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అభిమానులతో జరిగిన సంభాషణలో ఆయన ట్రోల్స్ను పట్టించుకోకుండా ముందుకు సాగాలని సూచించారు. ఎవరి అభిప్రాయాలు నచ్చకపోయినా వారిపై ద్వేషం పెంచుకోవడం లేదా సమయాన్ని వృథా చేయడం సరైన విధానం కాదని చెప్పారు. “మనకు నచ్చని వస్తువు కోసం డబ్బు ఖర్చు చేయం కదా.. అలాగే నచ్చని వ్యక్తులు లేదా విషయాల కోసం మన విలువైన సమయాన్ని ఎందుకు వెచ్చించాలి” అంటూ అభిమానులకు అల్లు అర్జున్ సూచించారు.
ఇతరులపై నెగెటివ్గా స్పందించే బదులు, తమ లక్ష్యాలు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా యుగంలో విమర్శలు సహజమని, అయితే వాటికి ప్రతిస్పందిస్తూ మన శక్తి, సమయాన్ని కోల్పోకూడదని అల్లు అర్జున్ అన్నారు. ఎవరి పని వారికి నచ్చిన విధంగా చేసుకుంటూ, తమ జీవితంలో ముందుకు సాగడం ముఖ్యమని అభిమానులకు హితవు పలికారు. అభిమానులు తమ ఇష్టమైన వ్యక్తులను ప్రోత్సహించడం సహజమేనని, కానీ ఇతరులను విమర్శించే స్థాయికి వెళ్లకూడదనే సందేశాన్ని ఆయన ఇచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ALSO READ: Japan Earthquake | జపాన్ను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ








